పరిగి నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు అతనిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.