తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటాకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. కాగా శ్రీవాణి ట్రస్టు డోనర్స్ దర్శన, గదుల కోటా(ఆగస్టు) ఇవాళ ఉ.11 గంటలకు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.