వనపర్తి
మల్లురవికి మద్దతుగా కాంగ్రెస్ ప్రచారం
వనపర్తి జిల్లా కేంద్రంలోని 16వ వార్డు పాతకోటలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా గురువారం వార్డు అధ్యక్షులు ఆవుల రాజేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ కు ఓటు వేసి మల్లు రవిని ఎంపీగా గెలిపించాలని కాలనీవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో మహాలంక రాజు, ఆవుల జగదీష్, మల్లిరెడ్డి, చున్నుమియా పాల్గొన్నారు.