అన్నారం బ్యారేజ్ లో ఇసుక తొలగింపు

556చూసినవారు
భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో బుధవారం మరమ్మతులు చేపట్టారు. ఈ పనులకు ఇసుక మేటలు ఇబ్బందిగా మారడంతో. తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. పియర్స్ స్ట్రక్చర్ వద్ద 6. 20 లక్షల క్యూబిక్ మీటర్లు, ఎగువన 2. 54 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మేటలున్నట్లు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్