ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన

74చూసినవారు
మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో బుధవారం కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, బండికి సరైన ధృవపత్రాలు ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్సై భవాని సేన, ఏఎస్సై రాజేశం, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్