కల్లు గీత కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాస్ మృతి

50చూసినవారు
కల్లు గీత కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాస్ మృతి
కల్లు గీత కార్మిక సంఘం నాయకుడు జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన మేరిండ్ల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం వారు మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల హక్కుల కోసం, చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం, సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేసిన శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.

సంబంధిత పోస్ట్