రోడ్డు మధ్యలో ఇరుక్కున్న లారీ

84చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రోడ్డు పక్కన లారీ దిగబడగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏటూరు నాగారం మండలంలోని పప్కాపురం క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా ఓ ఇసుక లారీ దిగబడి ఉంది. ముందు భాగం రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా పెద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. స్థానికులు లారీని పక్కకు తీసే పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్