గిరిజన యూనివర్సిటీకి స్థల పరిశీలన చేసిన ప్రొఫెసర్

51చూసినవారు
గిరిజన యూనివర్సిటీకి స్థల పరిశీలన చేసిన ప్రొఫెసర్
ములుగు జిల్లా కేంద్రం సమీపంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉన్న స్థలాన్ని ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం పరిశీలన చేశారు. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరుపెట్టడం అభినందనీయమని, యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు వెంటనే శంకుస్థాపనలు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ప్రొఫెసర్ కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్