సామాజిక మాధ్యమాల్లో మంత్రి సీతక్కపై అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చింతల్ గీతారెడ్డిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మహిళ అనే గౌరవం లేకుండా ఫేస్ బుక్ లో అసభ్య పదజాలంతో పోస్టు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.