యువత జూదాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

51చూసినవారు
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి మంగళవారం వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ. అడవి జంతువుల వేటకోసం ఉచ్చులు, విద్యుత్ తీగలు పెట్టి ప్రమాదాలకు కారణం కావద్దన్నారు. అలా ఎవారైనా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత కోడి పందాలు, పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్