పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

9395చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం
దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గరిడె వెంకటేశ్వర్లు (50) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. వెంకేటేశ్వర్లు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్