బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.