Jul 15, 2024, 04:07 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
వివిధ రకాల కూరగాయలతో స్వామివారికి అలంకరణ
Jul 15, 2024, 04:07 IST
హనుమకొండ అతి చారిత్రాత్మకమైన సిద్దేశ్వర ఆలయంలో శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం శివపార్వతులకు వివిధ రకాల కూరగాయలతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణ అనంతరం స్వామివారికి మహా హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.