హన్మకొండ మరియు పరిసర ప్రాంత మహిళల కోసం నాయిని విశాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా జాబ్ మేళా ఏర్పాటు చేశామని ఆర్గనైజ్ కమిటీ వారు శనివారం మీడియా ప్రతినిధితో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గనైజ్ కమిటీ వారు మాట్లాడుతూ నిరుద్యోగ మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు.