జల వివాదం.. ఢిల్లీ సీపీకి ఆప్ మంత్రి ఆతిశీ లేఖ

72చూసినవారు
జల వివాదం.. ఢిల్లీ సీపీకి ఆప్ మంత్రి ఆతిశీ లేఖ
ఢిల్లీలో ప్రధాన పైపులైన్‌ల రక్షణ కోసం 15 రోజుల పాటు పోలీసుల పహారా కావాలని కోరుతూ ఢిల్లీ జల మంత్రిత్వ శాఖ మంత్రి ఆతిశీ ఆదివారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. 'యమునా నది ప్రవాహం తగ్గింది. రోజుకు 70 మిలియన్‌ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీనివల్ల నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి పైపులైన్‌లను రక్షించుకోవాలని ' ఆమె లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్