పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్

185076చూసినవారు
పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్
హైదరాబాద్ శిల్పకళావేదికలో 'పద్మ' అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మన వాళ్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డు ఇచ్చినప్పుడు మనం కూడా సన్మానించుకోవాలన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు చప్పట్లతోనే కాకుండా రూ.25 లక్షల నగదు అందజేస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి నెలా రూ.25 వేలు పెన్షన్ అందజేస్తామని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా.. మన వాళ్లేనని అన్నారు.

సంబంధిత పోస్ట్