యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం కొత్త గుండ్లపల్లి గ్రామంలోని 8వ వార్డు లోని రాజీవ్ నగర్ కాలనీలో అనారోగ్యంతో గుండ్లపల్లి నర్సయ్య(70)అనే వ్యక్తి చనిపోయాడు. కాగా తెలుగు జాతి సంప్రదాయం ప్రకారం కొడుకు అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ అతనికి సంతానంగా ఒక్క కూతురు చైతన్య మాత్రమే ఉండడంతో కొడుకే కూతురై తండ్రికి తలకొరివి పెట్టి చితికి నిప్పంటించింది.