తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బద్రినాథ్ ఆలయం నేడు తెరుచుకుంది. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. భారత సైన్యంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భక్తి గీతాలను ఆలపించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ‘బద్రీ విశాల్ లాల్ కీ జై’ అంటూ నినాదాలు చేశారు.