AP: పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే రిటైరైన ఉద్యోగులందర్నీ విధుల్లోంచి తొలగించాలని అన్ని శాఖల HODలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ లోగా అందరితో రాజీనామా చేయించి నివేదిక ఇవ్వాలన్నారు.