ఏపీలో దారుణం

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దారుణం జరిగింది. సోమవారం ఉదయం అవనిగడ్డ చర్చి వద్ధ గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదిలేసి వెళ్లారు. పాప ఏడుపు విని పాస్టర్ బయటకు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం అందించగా, అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్