ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కేయూలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించగా.. 44,446 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.