అమెరికాలో బాపట్ల జిల్లా యాజిలికి చెందిన దాసరి గోపీకృష్ణ (32)ను కాల్చి చంపిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితమే అమెరికా వెళ్లిన గోపీకృష్ణ డల్లాస్లోని ఓ కన్వీనియెన్స్ స్టోర్లో పని చేస్తున్నాడు. ఈ నెల 21న స్టోర్కు వచ్చిన నిందితుడు డవోంటా మాథిస్.. గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు. సీసీ కెమెరా ఆధారంగా అమెరికా పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు.