ఏపీలో వైసీపీ కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అలర్ట్గా ఉండాలని చెప్పారు. ఈసీ తీరు, అధికారులపై అనుమానాలున్న నేపథ్యంలో కౌంటింగ్ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు.