AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.