విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సంచలన విజయం నమోదు చేశారు. వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 94,058 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఇదే జిల్లా భీమిలిలోనూ వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఇదే రెండో అత్యధిక మెజారిటీ.