చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంపు

చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. YCP ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్