నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు

ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియా మాట్లాడి.. తిరిగి సా.4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబుది ఇదే తొలి పర్యటన.

సంబంధిత పోస్ట్