AP: ఎన్నికల ఫలితాలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతాయి. ఇండియా కూటమివైపు ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయం. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే టీడీపీకి అధికారం దక్కుతుంది. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు సమగ్రంగా జరగాలి." అని డిమాండ్ చేశారు.