AP: ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.