AP: ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫోన్లో అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు. "నా రాజకీయ ప్రయాణంలో ఆయనతో చాలా కాలంగా అనుబంధం ఉంది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా." అని పట్నాయక్ రాసుకొచ్చారు.