మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. ఎస్పీ ఆఫీస్లో సంతకం చేసి వెళ్లారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా 3 కేసులు నమోదు కాగా ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేశారు. దీంతో పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది. నిత్యం ఎస్పీ ఆఫీస్లో సంతకం చేయాలని ఆయనను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన ఎస్పీ ఆఫీస్కు వచ్చి వెళ్లారు.