AP: మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. పిన్నెల్లి లొంగిపోతారనేది కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు.