ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠకు తెర పడింది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రి పదవులు ఖరారయ్యాయి. అలాగే మిత్ర పక్షాల్లో జేడీఎస్ నేత కుమార స్వామికి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది.