షర్మిల.. ఆ పార్టీ ప్రకారం మాట్లాడుతున్నారు: బొత్స

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘మాపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నాం. షర్మిల ఒక పార్టీలో ఉన్నారు. మరో పార్టీ ప్రకారం మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. విమర్శలు చేసేటప్పుడు షర్మిల సంయమనం పాటించాలి. నిన్నటి వరకు చెల్లి.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి.’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్