విడపనకల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో సీజనల్ వ్యాధులపైన అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కొండయ్య, మలేరియా సబ్ యూనిట్ అధికారి కోదండ రాంరెడ్డి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు రోగాలకు దూరంగా ఉంటారని వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మండల స్థాయి అధికారులు అందరికీ ఉందన్నారు.