చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, పలువురు అధికారులు పుష్పగుచ్చం అందించి కలెక్టరు శుభాకాంక్షలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి జిల్లాలలో పనిచేశానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు.