ఏపీ సచివాలయానికి నేడు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వెళ్తున్నారు. మ.3 గంటలకు తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పవన్కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.