రేగిడి మండలం లో వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం

రేగిడి మండలం ఉంగరాడమెట్ట గ్రామంలో మంగళవారం వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. రాజాం నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్ధి డా. తలే రాజేష్ ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా విక్రాంత్, డా. తలే రాజేష్ మాట్లాడుతూ ప్రజాశీస్సులతో అధికారంలోకి రాబోయేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమన్నారు.

సంబంధిత పోస్ట్