AP: గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధనాన్ని వడ్డీతో సహా కక్కిస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని, వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప విచ్చేసిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.