AP: పల్నాడులో అల్లర్లకు చంద్రబాబే కారణమని వైసీపీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. "చంద్రబాబు ఎక్కడికి వెళ్లారనేది ఇప్పడు చర్చనీయాంశమైంది. ప్రజలు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారని, వెళ్లలేదని రకరకాల వార్తలు రావడంతో ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. దోచిన డబ్బు దాచుకోవడానికే చంద్రబాబు దుబాయ్ వెళ్లారా?" అని మంత్రి ఎద్దేవా చేశారు.