అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్లో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో రూ.55 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు.