చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతులు దుర్మరణం

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మంలోని మామిళ్లగూడెం వాసులు సూర్యనారాయణ, రుక్మిణిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటికి మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్