ఏపీ ఎన్నికల్లో ‘మెగా ఫ్యామిలీ’ మార్క్ కనిపిస్తోంది. ప్రచారానికి చివరిరోజు కావడంతో ఇవాళ పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. మరోవైపు తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. అయితే.. ఒకే ఇంట్లోని హీరోలు ఇలా వేర్వేరు పార్టీలకు సపోర్ట్ చేస్తుండటంతో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.