చైనా సైంటిస్టులు ఓ రోగికి సెల్ థెరపీ ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. చికిత్సలో భాగంగా తొలుత క్లోమంలోని కణజాలంపై షుగర్ ప్రభావాన్ని కృత్రిమ అల్గారిథమ్తో విశ్లేషించారు. తర్వాత సెల్ థెరపీతో మూల కణాల్లో కొన్ని మార్పులు చేశారు. వీటిని క్లోమంలో ప్రభావితమైన కణాల స్థానంలో ప్రవేశపెట్టారు. క్రమంగా రోగికి ఇచ్చే ఇన్సులిన్ను తగ్గించారు. ఇలా 11 వారాల్లోనే మందుల అవసరం లేకుండా చేశారు.