అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో తలదాచుకుంటున్న మణిపూర్ వాసులకు మానవతా సాయం అందించాలని సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. మణిపూర్లోని జిరిబామ్ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని దాదాపు 1,700 మంది ప్రజలు అసోంలోని కాచర్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. జిల్లా కమిషనర్ ఝా మాట్లాడుతూ ప్రస్తుతం కాచర్లో కుకీ, హ్మార్, నాగా, మైతేయి తెగలకు చెందిన 1,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.