45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుంది: కోమటి రెడ్డి

తెలంగాణలో మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్టీలో కూడా గ్రూపులు ఉంటాయని.. అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఇద్దరు పెద్ద నాయకులు ఉన్న నియోజక వర్గంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పి చైర్మన్ ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటాని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్