మహబూబాబాద్ జిల్లా గూడూరులో తల్లి, కుమారుడి హత్య జరిగింది. బొల్లేపల్లికి చెందిన తల్లి సమ్మక్క, కుమారుడు సమ్మయ్యను మంత్రాలు చేస్తున్నారని కుమారస్వామి అనే వ్యక్తి ఇనుప రాడ్తో హత్య చేశాడు. స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏడేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ఉందని స్థానికులు చెబుతున్నారు.