BREAKING: భారత జట్టుకు రూ.125 కోట్లు ప్రకటించిన బీసీసీఐ

2024-T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని BCCI సెక్రటరీ జే షా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఆటగాళ్లు, కోచ్‌లు, మద్దతుదారులందరికీ బీసీసీఐ సెక్రటరీ జై షా అభినందనలు తెలిపారు. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్