తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్లోని నివాసంలో ఆమె ఉరేసుకున్నారు. రూపాదేవి ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సూసైడ్కి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.