విగ్రహారాధన, శరీరానికి పూజలు జరపడానికి వ్యతిరేకి అయిన బుద్ధుడు భక్తులు తెచ్చిన పూలతో బోధి వృక్షానికి పూజలు చేయమని చెబుతారు. అప్పుడు గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి బేతవన విహారంలో నాటారు. ఆనాడు జరిగిన ఒక గొప్ప ఉత్సవంలో కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షవులు దేశదేశాల నుంచి తరలివచ్చారు. ఆనాటి నుంచి బోధి వృక్షానికి పూజ చేయడం ఆనవాయితీగా వచ్చింది.